బంగారు ఆభరణాలు చోరీ..

by Disha Web Desk 11 |
బంగారు ఆభరణాలు చోరీ..
X

దిశ, నవాబుపేట: కౌకుంట్ల మండలం పేరూరు గ్రామానికి చెందిన ఎం. జ్యోతి అనే మహిళ తన తల్లిగారి గ్రామమైన ఉడిత్యాలకు బస్సులో వెళుతుండగా మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగులో దాచి ఉంచిన ఐదు తులాల రెండు మాసాల బంగారం ఆభరణాలను తస్కరించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆమె తన పిల్లలతో పాటు ప్రయాణిస్తూ ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె బ్యాగు కట్ చేసి అందులో బంగారు ఆభరణాలు దాచి ఉంచిన బాక్సును ఎత్తుకెళ్లినట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.


Next Story

Most Viewed