చికిత్స పొందుతూ గీత కార్మికుడి మృతి

by Disha Web Desk 1 |
చికిత్స పొందుతూ గీత కార్మికుడి మృతి
X

దిశ, కౌడిపల్లి: చికిత్స పొందుతూ గీత కార్మికుడి మృతి చెందిన ఘటన కౌడిపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు హనుమగోని నాగేష్ గౌడ్(58) ఈ నెల 5న రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలోని వారి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పగలు ధాన్యాన్ని ఆరబెట్టి రాత్రి టార్పాలిన్ కప్పి ఇంటికి వద్దామని అక్కడే నిలబడి ఉన్నాడు. ఈ క్రమంలో కౌడిపల్లికి చెందిన వడ్డె శ్రీనివాస్ తన బైకుపై అతివేగంగా అజాగ్రత్తగా మెదక్ వైపు వెళుతూ.. నాగేష్ గౌడును బలంగా ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో నగేష్ గౌడ్ తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి నాగేష్ గౌడ్ ను 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం నారాయణ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. శనివారం చికిత్స పొందుతూ నగేస్ గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

Next Story

Most Viewed