Crime News: భర్త పేరుతో మాయమాటలు.. ఆ సాయంత్రం చెరువు వద్దకు తీసుకెళ్లి..

by samatah |   (  Updated:2022-09-26 05:13:12  IST  )

రోజు రోజుకు మహిళలపై దాడులనేవి పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా, వావి వరస మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది.

Crime News: భర్త పేరుతో మాయమాటలు..  ఆ సాయంత్రం చెరువు వద్దకు తీసుకెళ్లి..
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులనేవి పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా, వావి వరస మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని బారాబంకీ జిల్లాలో మహిళను, ఓ యువకుడు నిన్ను మీ ఆయన తీసుకొని రమ్మన్నాడు అని అబద్దం చెప్పి, నిర్మానుశ్య ప్రాంతం చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే ముగ్గురు యువకులు ఉన్నారు. దీంతో వారందరూ కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ విషయం ఆలస్యంగా మహిళ తన భర్తకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story