ఆదిలాబాద్ జిల్లాలో దారుణం...వివాహితపై సామూహిక అత్యాచారం

by Disha Web Desk 20 |
ఆదిలాబాద్ జిల్లాలో దారుణం...వివాహితపై సామూహిక అత్యాచారం
X

దిశ, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని డోర్లి గ్రామంలో ఓ వివాహిత పై నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో సామూహిక లైంగిక దాడి చేశారు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ రఘుపతి వెల్లడించిన వివరాల ప్రకారం డోర్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ (30)కు భర్త, పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పనులకు వెళ్లగా, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండడంతో, ఇదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మహిళ ఇంటికి వచ్చారు.

ఒంటరిగా ఉండటం గమనించి ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు. పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలిని కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో ఆదివారం ఆమె అసలు విషయం చెప్పడంతో, కుటుంబ సభ్యులు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.


Next Story

Most Viewed