నాలుగో త‌ర‌గ‌తి బాలుడు ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

దిశ, శేరిలింగంపల్లి : నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా

నాలుగో త‌ర‌గ‌తి బాలుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ, శేరిలింగంపల్లి : నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఆంజనేయులు యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజేంద్రరెడ్డి కాలనీలో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న శంకర్ వాచ్ మెన్ గా పనిచేస్తూ తన పిల్లలను ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నాడు. శంకర్ కుమారుడు ప్రశాంత్ (9) స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో 4వ తరగతి చదువుతున్నాడు. రోజులాగే బడికి వెళ్లిన ప్రశాంత్ మంగళవారం స్కూల్ నుండి ఇంటికి వచ్చాక వారు నివాసం ఉంటున్న ఇంటి బాత్ రూమ్ లో తన స్కూల్ ఐడి కార్డుతో ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యగా ధృవీకరీంచారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story