రెండో అంతస్తు నుంచి జారిపడి నాలుగేళ్ల చిన్నారి మృతి

by Yella Dhawani Reddy |

తండ్రికి బై చెబుతూ హర్షవర్థన్ (4) రెండో అంతస్తు నుంచి జారిపడ్డాడు.

రెండో అంతస్తు నుంచి జారిపడి నాలుగేళ్ల చిన్నారి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటేల్‌గూడ పరిధిలోని బీహెచ్ఈఎల్ (BHEL) కాలనీలో నాలుగే బాలుడు మృతిచెందాడు. తండ్రికి బై చెబుతూ హర్షవర్థన్ (4) రెండో అంతస్తు నుంచి జారిపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Next Story