Palnadu: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు(Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు చెట్టును ఢీకొట్టింది.

Palnadu: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు(Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళగిరి రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story