కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం

by Nallavelli.Anjaneyulu |

దిశ, చౌటుప్పల్ టౌన్ : కుటుంబ క‌ల‌హాల‌తో వ్య‌క్తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న చౌటుప్ప‌ల్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్

కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : కుటుంబ క‌ల‌హాల‌తో వ్య‌క్తి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న చౌటుప్ప‌ల్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణానికి చెందిన సయ్యద్ రఫీ (27) వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.రఫీ కి గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇతనికి భార్య, ఇద్దరు కొడుకులు సంతానం. తరచూ ఇంట్లో జరిగే కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపం చెందాడు. మంగళవారం ఇంట్లో ఎవ్వ‌రు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడు. మృతుని తండ్రి సయ్యద్ షర్ఫుద్దీన్ ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story