హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-04 13:24:00  IST  )

హైదరాబాద్‌(Hyderabad)లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.

హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. భూ వివాదం విషయంలో రాయదుర్గం(Raidurgam)లో రెండు వర్గాల మధ్య మంగళవారం మధ్యాహ్నం భారీ ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి గన్‌తో గాలిలోకి కాల్పులు(Gun Firing) జరిపారు. దీంతో చేసేదేంలేక మరోవర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు కాల్పులు జరిపిన కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More... ‘కాల్పులు జరగలేదు.. గన్‌తో బెదిరించారు’: డీజీపీ కార్యాలయం వివరణ

Next Story