ఆరెంజ్​ ప్రై వేటు ట్రావెల్స్​ బస్సులో అగ్ని ప్రమాదం..

by Disha Web Desk 20 |
ఆరెంజ్​ ప్రై వేటు ట్రావెల్స్​ బస్సులో అగ్ని ప్రమాదం..
X

దిశ, కూకట్​పల్లి : బాలానగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ప్రధాన రహదారి పై హెప్​ పెట్రోల్​ బంకు సమీపంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు పై ప్రయాణిస్తున్న ఆరేంజ్​ ట్రావెల్స్​కు చెందిన ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని మంటలు అంటుకున్నాయి. బస్సులో ఇద్దరు ప్రయాణికులు, డ్రైవర్​ మాత్రమే ఉన్నారు. మంటలు అంటుకున్న వెంటనే డ్రైవర్​, ఇద్దరు ప్రయాణికులు కిందికి దిగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.



Next Story

Most Viewed