- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire Accident: ప్రైవేటు బస్సులో మంటలు.. 35 మంది ప్రయాణికులు సేఫ్
by Kema Shiva Kumar |
ప్రైవేటు బస్సు (Private Bus)లో మంటలు చెలరేగిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని నంద్యాల (Nandyal) టోల్గేట్ సమీపంలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్డెస్క్: ప్రైవేటు బస్సు (Private Bus)లో మంటలు చెలరేగిన ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని నంద్యాల (Nandyal) టోల్గేట్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు బస్సు తిరువన్నామలై (Thiruvannamalai) నుంచి హైదరాబాద్ (Hyderabad)కు వస్తుంది. ఈ క్రమంలోనే బస్సు సరిగ్గా నంద్యాల (Nandyal) టోల్గేట్ సమీపంలోకి రాగానే టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయి బస్సులో మంటలు చేలరేగాయి. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై బస్సులో నుంచి దిగి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
Next Story






