ఏపీలో దారుణం.. కొడుకును చంపి పాతిపెట్టిన తండ్రి

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకునే ఓ తండ్రి హ‌త్య చేసి పాతిపెట్టాడు. రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లాలోని ఎర్ర‌బాలెంలో జ‌రిగింది.

ఏపీలో దారుణం.. కొడుకును చంపి పాతిపెట్టిన తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకునే ఓ తండ్రి హ‌త్య చేసి పాతిపెట్టాడు. రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లాలోని ఎర్ర‌బాలెంలో జ‌రిగింది. త‌న కొడుకు క‌నిపించ‌డంలేద‌ని త‌ల్లి ప్ర‌మీలాబాయి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విచార‌ణ మొద‌లుపెట్టారు. కాగా విచార‌ణ‌లో షాకింగ్ నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. కొడుకును అత‌డి తండ్రే హత్య చేశాడ‌ని పోలీసులు గుర్తించారు. దీంతో అత‌డిని అదుపులోకి తీసుకుని త‌మ స్టైల్ లో విచారించారు.

కొడుకు జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డ్డాడ‌ని, త‌న‌కు తెలియ‌కుండా గొర్రె పిల్ల‌ల‌ను అమ్ముతున్నాడని అందుకే చంపేశాన‌ని తండ్రి పోలీసుల విచార‌ణ‌లో అంగీక‌రించాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మీడియాతో మాట్లాడిన మృతుడి త‌ల్లి త‌న‌కు ఏం తెలియ‌ద‌ని, కొన్ని రోజులుగా త‌న కొడుకు క‌నిపించ‌లేద‌ని చెప్పింది. అస‌లు ఏం జ‌రిగిందో పోలీసులు చెప్పేవ‌ర‌కు త‌న‌కు తెలియ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌న ప్రాణంలాంటి కొడుకుని చంపేశాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంది. కొడుకును చూసే అదృష్టం కూడా ద‌క్క‌లేద‌ని బోరున విల‌పించింది.

Next Story