- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీలో పరువు హత్య కలకలం.. కన్న కూతురిని దారుణంగా హత్య చేసి..
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో పరువు హత్య కలకలం రేపింది. కుటుంబం పరువు తీస్తోందని కన్నకూతురిని ఓ తండ్రి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరుకి చెందిన దేవేందర్ రెడ్డికి ప్రసన్న అనే ఓ కూతురు ఉంది. కాగా, ఇటీవల ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్తో కూతురు ప్రసన్నకు వివాహం జరిపించాడు తండ్రి దేవేందర్ రెడ్డి. అయితే, వివాహనికి ముందే ఓ యువకుడిని ప్రేమించిన ప్రసన్న.. పెళ్లి జరిగిన తర్వాత కూడా అతడిని మర్చిపోలేకపోయింది.
ఇటీవల తల్లిగారింటికి వచ్చిన ప్రసన్న.. ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని అత్తగారింటికి వెళ్లడం లేదు. కూతురు ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన దేవేందర్ రెడ్డి.. ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ కాపురానికి వెళ్లకుండా అలాగే వివాహేతర సంబంధం కొనసాగించడంతో దేవేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.
వివాహం జరిగిన తర్వాత అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబ పరువు తీస్తోందనే కోపంతో కూతురు ప్రసన్నను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తల, మొండెంను వేరు చేసి కూతురు మృతదేహాన్ని గిద్దలూరు ఫారెస్ట్లో పడేశాడు. అయితే, మనువరాలు కనిపించడం లేదని ప్రసన్న తాత ఆరా తీయడంతో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి తాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు తరలించారు.