- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హెచ్ఆర్ వేధింపులు తాళలేక ఉద్యోగి ఆత్మహత్య..
దిశ, కొత్తూరు: తాను పనిచేస్తున్న కంపెనీలోని హెచ్ఆర్ వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తూరు మున్సిపల్ పరిధిలో గల స్టేషన్ తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం స్టేషన్ తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పాశం సురేష్ (29)తిమ్మాపూర్ గ్రామ పరిధిలోని వావిండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 2016 నుంచి ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా గత కొంతకాలం నుంచి కంపెనీ హెచ్ఆర్ రవికుమార్ వేధింపులకు గురి చేస్తున్నాడని కుటుంబ సభ్యులతో వాపోయేవాడు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం పాశం సురేష్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కాగా నోటీసు కాలం ఉండటంతో మే 5 వ తేదీ వరకు కంపెనీలో ఉద్యోగ విధిని నిర్వహించాడు. అనంతరం హెచ్ఆర్ వేధింపులు, ఉద్యోగ విరమణతో మానసిక క్షోభకు గురైన సురేష్ ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఇంట్లో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడి తల్లి పాశం అనసూయ ఫిర్యాదు మేరకు కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.