- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వృద్ధురాలి హత్య.. ఇంట్లో దోపిడి..
దిశ, ఎల్బీనగర్ : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు. వృద్ధురాలు సత్తమ్మను దారుణంగా హత్య చేశారు. సత్తమ్మను హత్య చేసిన అనంతరం ఆమె వద్ద ఉన్న సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం వనస్థలిపురంలోని ప్రశాంతనగర్ లో తన కొడుకు ఇంటి వద్ద నుండి తొర్రూర్ లోని తన ఇంటికి వచ్చింది. రాత్రి 11 తన కొడుకుతో కూడా ఫోన్ లో మాట్లాడింది.
అయితే సోమవారం ఉదయం ఇంటి తలుపులు తీసి ఉండటం సత్తమ్మ నిద్ర లేవకపోవడం, సత్తమ్మ తలకు గాయం అవ్వడంతో ఆమె మృతి చెందిందని తెలుసుకొని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, వనస్థలిపురం ఏసిపి పురుషోత్తం రెడ్డి, హయత్ నగర్ సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్య దోపిడీ ఒక్కరు చేశారా లేక ముఠాగా ఏర్పడి ఈ దారుణానికి వడిగట్టారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన అనంతరం ఎక్కడికి వెళ్లారన్న కోణంలో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.