యువతి, వివాహిత అదృశ్యం

by Disha Web Desk 1 |
యువతి, వివాహిత అదృశ్యం
X

దిశ, కంది : సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి, వివాహిత అదృశ్యమైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ధర్మిన్ పాటిల్ (19) కంది మండల కేంద్ర పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇంటిలో నివాసం ఉంటుంది. తాను ఇంట్లో పని చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది. కాగా, ఈనెల 13న రాత్రి సమయంలో ఇంట్లో నుంచి ధర్మిన్ పాటిల్ వెళ్లిపోయింది. అదేవిధంగా.. సంగారెడ్డి మండలం ఫసల్వాది తండాలో నివసిస్తున్న కేతావత్ బుజ్జి (42) ఈనెల 9న బయటికి వెళ్లి వస్తానని చెప్పి చీకటి పడిన ఇంటికి తిరిగి రాలేదు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఆమె తన వెంట 9290751419 నంబరు గల సెల్ ఫోన్ వెంట తీసుకెళ్లింది. పైన తెలిపిన ఇద్దరు అదృశ్యమైన ఘటనలో ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే 8712656746 రూరల్ ఎస్సై నెంబర్ కు సమాచారం అందించాలని ఆయన కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.



Next Story

Most Viewed