విద్యార్థి అదృశ్యం

by Disha Web Desk 1 |
విద్యార్థి అదృశ్యం
X

దిశ చేగుంట : కిరాణా షాప్ కి వెళ్తున్నానని అని చెప్పి బయటకు వెళ్లిన ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన మాసాయిపేట్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన పోతాన్పల్లి సాయికుమార్ (13) తూప్రాన్ లోని బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చిన సాయి కుమార్ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కిరాణా షాప్ కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా.. సాయికుమార్ ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలుడి తల్లి యాదమ్మ చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి సాయికుమార్ బయటకు వెళ్లేటప్పుడు నీలం రంగు షర్టు నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, నాలుగున్నర అడుగుల ఎత్తు తెలుపు రంగులో ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు చేగుంట పోలీస్ స్టేషన్లో తెలియ చేయాలని ఎస్సై ప్రకాష్ గౌడ్ సూచించారు.

Next Story