ఇంటర్ విద్యార్థి అదృశ్యం

by Disha Web Desk 1 |
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
X

దిశ, నిజామాబాద్ క్రైం : పట్టణ పరిధిలోని వినాయక నగర్ చెందిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని నాలుగో టౌన్ ఎస్సై సందీప్ తెలిపిన కథనం ప్రకారం.. వినాయక నగర్ కు చెందిన పిట్టల యాదగిరి (17) అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో యాదగిరి ఫెయిల్ అయ్యాడు. దీంతో అతను ఇంటి నుంచి బయటకు వెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా తాను హైదరాబాద్ మామయ్య ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడని అతని తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి యాదగిరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story

Most Viewed