‘కాల్పులు జరగలేదు.. గన్‌తో బెదిరించారు’: డీజీపీ కార్యాలయం వివరణ

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-04 13:24:57  IST  )

హైదరాబాద్ కాల్పుల ఘటన(Gun Firing Incident)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల ఘటనపై డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చింది.

‘కాల్పులు జరగలేదు.. గన్‌తో బెదిరించారు’: డీజీపీ కార్యాలయం వివరణ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కాల్పుల ఘటన(Gun Firing Incident)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల ఘటనపై డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చింది. స్థలం విషయంలో ఏపీ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య మంగళవారం మణికొండలోని పంచవటి కాలనీలో ఘర్షణ జరిగింది. తనపై గన్‌ పెట్టి అల్లుడు అభిషేక్ గౌడ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ప్రభాకర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పటికే అల్లుడు అభిషేక్‌పై అక్టోబర్ 25వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్ కుమారుడే ఈ అభిషేక్ గౌడ్ కావడం విశేషం. ప్రస్తుతం ఈ కాల్పులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Read More... హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం

Next Story