ప్రేయసిని నడిరోడ్డు మీద నరికి చంపిన సాహిల్ అరెస్ట్

by Dishafeatures2 |
ప్రేయసిని నడిరోడ్డు మీద నరికి చంపిన సాహిల్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో జనం చూస్తుండగా తన ప్రియురాలిని సాక్షి (16) కత్తితో పొడిచి చంపాడు సాహిల్ అనే వ్యక్తి. పలుమార్లు పొడుస్తూ.. బండరాయితో మోదుతూ ప్రియురాలు సాక్షిని ఆ దుర్మార్గుడు అతి కిరాతకంగా హత్య చేసిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని షహబాద్ డైరీ పరిధిలోని రోహిణిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుడిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కాగా ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. టీమ్ లు గా విడిపోయి గంటల వ్యవధిలోనే హంతకుడు సాహల్ ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో అతడిని అరెస్టు చేసినట్లు డీసీపీ సుమన్ నాల్వా తెలిపారు. కాగా సాహిల్, సాక్షి ప్రేమించుకున్నారని, అయితే శనివారం వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుందని, ఈ నేపథ్యంలోనే సాహిల్ ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed