మామ చనిపోయాడని కోడలు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?

by Disha Web Desk 9 |
మామ చనిపోయాడని కోడలు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. వావి వరుసలు మరచి చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా ఘటనలు ఎన్నో చూస్తున్నాం. కన్న తండ్రే కూమార్తెపై, ఉపాధ్యాయుడు విద్యార్థినిపై, మామ కోడలు మీద, అభం శుభం ఎరగని చిన్నారులపై ఇలా అత్యాచారాలకు తెగబడుతున్నారు కామాంధులు. అలాగే కొన్ని చోట్ల మహిళలు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. ఇవి హత్యలకు దారితీయడం జరుగుతున్నాయి.

అయితే ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని సియోని ప్రాంతంలో చోటుచేసుకుంది. భూత్ బంధాని గ్రామంలో సంజయ్ ధుర్వే, తన భార్య, తండ్రి దరోగ్ సింగ్‌ ఓకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే సంజయ్.. తండ్రి, భార్యకు మధ్య సంబంధం ఉన్నట్లు తరచూ అనుమానించేవాడు. దరోగ్ సింగ్‌తో చాలా సార్లు గొడవ కూడా పడ్డాడు.

వీరి వ్యవహారం కంట్రోల్ తప్పడంతో రగిలిపోయిన కుమారుడు, తండ్రిని ఓ నిర్జల ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. దగ్గర్లో ఉన్న స్థానికులు పోలీసులకు విషయం తెలుపగా.. ఘటనా స్థలికి చేరుకున్నారు. మరోవైపు సంజయ్ భార్య కూడా భయంతో సూసైడ్ చేసుకుంది. దీంతో మామ, కోడళ్ల మధ్య అక్రమ సంబంధం బయటపడింది. తండ్రిని చంపిన సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed