హైదరాబాద్‌లో లక్షకు మూడు లక్షలు.. గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు!

by Disha Web Desk 19 |
హైదరాబాద్‌లో లక్షకు మూడు లక్షలు.. గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో భారీగా దొంగ నోట్లు కలకలం రేపాయి. సైబరాబాద్ పోలీసులు మంగళవారం నకిలీ కరెన్సీ తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. 13 మంది అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.36 లక్షలు విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా నిందితుల నుండి రూ.60 నగదుతో పాటు 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిందితులు లక్ష రూపాయలకు మూడు లక్షల రూపాయల దొంగ నోట్లు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు రాజేష్ తన వద్ద నకిలీ కరెన్సీ ఉందని, కావాలనుకున్న వారు కాంటాక్ట్ చేయవచ్చని మొబైల్ నెంబర్‌ను అకౌంట్ డీపీలో పెట్టి ఈ దందా కొనసాగిస్తున్నాడని సీపీ వెల్లడించారు.

Next Story

Most Viewed