బ్రేకింగ్: కోట్లాది మంది వ్యక్తిగత డేటా లీక్.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ విషయాలు!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: కోట్లాది మంది వ్యక్తిగత డేటా లీక్.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ విషయాలు!
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: కోట్లాది మంది వ్యక్తిగత డేటాను తస్కరిస్తున్న గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు సభ్యులుగా ఉన్నట్టు గుర్తించారు. తస్కరిస్తున్న డేటాను ప్రైవేట్ వ్యక్తులకు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నట్టు దర్యాప్తులో తేలింది. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు వేర్వేరు రాష్ట్రాల పోలీసులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేస్తున్న పోలీసులు పలు గ్యాంగులను పట్టుకున్నట్టు సమాచారం. కాగా, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ మధ్యాహ్నం సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.

Next Story

Most Viewed