- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మెట్రోలో సెక్యూరిటీ సిబ్బందిగా ట్రాన్స్జెండర్లు.. హర్షం వ్యక్తం చేసిన సీవీ ఆనంద్
సమాజంలో వివక్షకు గురిఅవుతున్న (Transgender) ట్రాన్స్జెండర్లకు ఉపాధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో వివక్షకు గురిఅవుతున్న (Transgender) ట్రాన్స్జెండర్లకు ఉపాధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. వారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోలో ట్రాన్స్జెండర్లు సెక్యూరిటీ గార్డులుగా విధుల్లో చేరి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. 20 మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ సిబ్బందిగా నియమించారు. వారికి ప్రత్యేక శిక్షణను అందించి, స్టేషన్ల భద్రత, ప్రయాణికుల స్క్రీనింగ్ వంటి కీలక బాధ్యతలను వీరు నిర్వహించనున్నారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు విస్తరించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ సందర్భంలో రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ ఎక్స్ (ట్వీట్టర్) ద్వారా స్పందిస్తూ ‘ఇది చూసి చాలా ఆనందంగా ఉంది, వారు సమాజంలో కలిసిపోవడానికి మరో ముందడుగు’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ సెక్యూరిటీ సిబ్బంది మహిళల భద్రతకు మద్దతు ఇస్తారని సంస్థ పేర్కొంది. ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు, బ్యాగేజ్ స్కానర్లలో సహాయం చేస్తారని, స్టేషన్లు రైళ్లలో భద్రతను బలోపేతం చేస్తారని ఈ సందర్భంగా సంస్థ తెలిపింది. కాగా, హైదరాబాద్లో ట్రాఫిక్ను నియంత్రించే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఇటీవల 44 మంది ట్రాన్స్జెండర్లను ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ట్వీట్ ఇదే..






