- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిసెప్షన్ ముందు గదిలో రక్తపు మడుగులో కనిపించిన జంట
by Malleboina Mahesh |
నూతనంగా పెళ్లైన జంట రిసెప్షన్ ముందు తమ గదిలో శవాలై కనిపించారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయ్పూర్లో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్డెస్క్: నూతనంగా పెళ్లైన జంట రిసెప్షన్ ముందు తమ గదిలో శవాలై కనిపించారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయ్పూర్లో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 19 ఏళ్ల అస్లాం(24), కహ్కషా బానో (22)కు వివాహం జరిగింది. కాగా ఈ రోజు ఉదయం వారి రిసెప్షన్ ఉండగా వారు గదిలో ఉన్నారు. కాగా కొద్ది సేపటికి గది నుంచి వదువు అరుపులు ఆమె తల్లికి వినిపించాయి.
దీంతో ఆమె పరుగెత్తుకుంటూ జంట ఉన్న గదికి చేరుకుంది. కానీ ఆ గది లోపల నుంచి లాక్ చేసి ఉంది. దీంతో ఆమె బంధువులతో కలిసి బలవంతంగా తలుపులు బద్దలు కొట్టి చూడగా దంపతులు రక్తపు మడుగులో పడి ఉన్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు సమాచారం అందివ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష కోసం పంపించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Tags
- new couple
- Died
Next Story






