- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆరేళ్లుగా తల్లితో సహజీవనం.. రెండేళ్లుగా కూతుళ్లపై అత్యాచారం.. బ్లడ్ టెస్తో విషయం వెలుగులోకి!

దిశ, వెబ్ డెస్క్: అతనో బాధ్యతయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. భార్య చనిపోవటంతో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత నీచానికి పాల్పడ్డాడు. తల్లి లేని సమయంలో ఆమె ఇద్దరు కూతుళ్లపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా ఆ కామాంధుడికి హెచ్ఐవీ (HIV) పాజిటివ్ రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుసుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొన్నేండ్ల క్రితం అతడి భార్య చనిపోయింది. ఈ క్రమంలో అతడికి భర్తతో విడిపోయిన ఓ మహిళతో 2018లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెతో సహజీవనంలో ఉంటున్నాడు. సదరు మహిళకు 19 ఏళ్లు, 15 ఏళ్లు ఉన్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే, గత రెండేండ్లుగా ఆ మహిళ లేని సమయంలో వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లికి చెప్తే చంపేస్తానని బెదిరించటంతో ఈ బాలికలు మౌనంగా ఉండిపోయారు. అయితే ఇటీవల ఆ కామాంంధుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. అందులో అతడికి హెచ్ఐవీ పాజిటివ్గా (HIV Positive) తేలింది. ఈ విషయం తెలియడంతో పాటు, తమపై అత్యాచారం చేశాడని ఇద్దరు అమ్మాయిలు తల్లికి చెప్పారు. ఈ విషయం తెలిసి షాక్ అయిన సదరు మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం తల్లీ ఇద్దరు కూతుళ్లకు సైతం హెచ్ఐవీ టెస్ట్ చేసేందుకు శాంపిళ్లు సేకరించారు.