బోధన్ 231 కోట్ల స్కాంలో సీఐడీ ఛార్జీషీట్​

by Dishafeatures2 |
బోధన్ 231 కోట్ల స్కాంలో సీఐడీ ఛార్జీషీట్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: బోధన్ నకిలీ కమర్షియల్ చలాన్ల కేసులో సీఐడీ అధికారులు కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించారు. 231 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన డబ్బు రాకుండా పోయిన ఈ కేసులో కమర్షియల్​ ట్యాక్స్ విభాగంలో పని చేస్తున్న పలువురు అధికారులను నిందితులుగా పేర్కొన్నారు. సీఐడీ అదనపు డీజీపీ మహేశ్ భగవత్​ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్​ టౌన్ వాస్తవ్యులు, తండ్రీకొడుకులైన సింహాద్రి లక్ష్మీశివరాజ్, సింహాద్రి వెంకట సునీల్​లు ప్రైవేట్​ ట్యాక్స్ ఆడిటర్స్ గా పని చేస్తున్నారు. వీరి వద్ద విశాల్ పటేల్, నారాయణ దాస్​ వెంకట కృష్ణమాచారి, సత్యవెంకట కృష్ణకుమార్, మహేశ్, రాకేశ్, రమణ, వంగల శ్రీనివాస్, మహ్మద్​నజీరుద్దీన్​, అర్రోజుల రాజేశ్​వీరి వద్ద ఉద్యోగులు. వీళ్లంతా కలిసి తేలికగా కోట్లాది రూపాయలు సంపాదించటానికి నకిలీ కమర్షియల్ ట్యాక్స్ కుట్రకు తెర లేపారు.

ఈ క్రమంలో నిజామాబాద్ బోదన్ కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పని చేస్తున్న రాథోడ్ ధర్మ విజయకృష్ణ, అనంతశయనం వేణుగోపాల స్వామి, హనుమాన్​సింగ్, ధరణి శ్రీనివాసరావు, పూర్ణచంద్రారెడ్డి, కిషన్, కే.నాగేశ్వరరావు, కే.విజయకుమార్, రత్నకుమారి, బీ.ఎన్.ఇందిర, జే.రాజయ్య, ఎస్.సాయిలును తమతో కలుపుకొన్నారు. దీంతోపాటు సీ.స్వర్ణలత, కే.అరుణ్​రెడ్డి, బీ.పీరాజీ, రవీంద్రబాబు, ఆర్​.బాలరాజు, బీ.చంద్రహాస్, ఆర్.వినోద్​ కుమార్, బీ.రంగారావు, ఎల్.బజరంగ్, సీ.శ్రీధర్లను కూడా కుట్రలో భాగస్వాములుగా చేసుకున్నారు. వీరి సహాయంతో వాస్తవంగా వ్యాట్​ చెల్లించిన వారి వివరాలను వీఏటీఐఎస్​పోర్టల్​లో తారుమారు చేశారు. నకిలీ చలాన్లు సృష్టించి వాటి వివరాలను పోర్టల్​లో నమోదు చేయటం ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన 231 కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలకు పైగా డబ్బును కొల్లగొట్టారు. ఈ మేరకు 2017, ఫిబ్రవరి 2న బోదన్​సర్కిల్​సీటీఓ విజయేందర్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నిజామాబాద్​పోలీసులు కేసులు నమోదు చేయగా సీఐడీ అధికారులు దర్యాప్తు బాధ్యతలను తీసుకున్నారు.

ఈ క్రమంలో మొత్తం 34 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో కమర్షియల్​టాక్స్​విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులు 23మంది ఉన్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐడీ ఎకనామికల్​అఫెన్సెస్​వింగ్​శ్యాంప్రసాదరావు నిందితులుగా ఉన్న కమర్షియల్​టాక్స్ ఉద్యోగులను విచారించటానికి కోర్టు నుంచి అనుమతి తీసుకుని తాజాగా కరీంనగర్​ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్​దాఖలు చేశారు. ఐపీసీ 409, 471, 477–ఏ రెడ్​విత్​34, 406, 420, 468, 120బీ, అవినీతి నిరోధక చట్టం సెక్షన్​13(1)(ఏ)(బీ) రెడ్​విత్​13(2)​ల ప్రకారం కేసులు నమోదు చేశారు. కేసులో 123మందిని సాక్షులుగా పేర్కొన్నారు. 68 సాఫ్ట్​వేర్ ​ఆబ్జెక్ట్స్, 143 డాక్యుమెంట్లు, 3 ఆడిట్​రిపోర్టులను ఆధారాలుగా న్యాయస్థానానికి సమర్పించారు.

Next Story

Most Viewed