- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pashamylaram : పాశమైలారం ఘటన.. సిగాచీ కంపెనీపై కేసు నమోదు
by Muthe.Rajitha |
పాశమైలారం(Pashamylaram) ఘటనపై తొలి కేసు నమోదైంది(Case Filed).

X
దిశ, వెబ్ డెస్క్ : పాశమైలారం(Pashamylaram) ఘటనపై తొలి కేసు నమోదైంది(Case Filed). సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు(Sigachi Explosion) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా, మరో 30 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని సహాయక బృందాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఘటనపై బీడీఎల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదు చేయడంతో సిగాచీ కంపెనీ యాజమాన్యంపై 105, 110, 117 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






