హైవేపై ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

by Naga Rani Yarlagadda |

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ లోనిజామ్ వరమ్ గఢ్ లోని దౌసా - మనోహర్ పూర్ NH- 148పై జరిగిన ఈ ప్రమాదంలో ..

హైవేపై ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ లోనిజామ్ వరమ్ గఢ్ లోని దౌసా - మనోహర్ పూర్ NH- 148పై జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. వేగంగా వచ్చిన కారు ట్రక్కును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరికి గాయాలు కావడంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను ఇంకా గుర్తించలేదన్నారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందన్నారు.

Next Story