డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

by Naga Rani Yarlagadda |

బాపట్ల జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.

డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: బాపట్ల జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కుక్కను తప్పించబోయిన కారు.. డివైడర్ ను ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందినవారు మరణించారు. జిల్లాలోని మార్టూరు మండలం కోలలపూడి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. సమాచారంతో అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతులు లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25)గా గుర్తించారు. తిరుపతి నుంచి పిఠాపురంకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతులను పోస్టుమార్టంకు తరలించారు.

Next Story