- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
600 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురు దుర్మరణం
by Naga Rani Yarlagadda |
కారు అదుపుతప్పి 600 అడుగుల లోయలో పడటంతో.. ఆరుగురు దుర్మరణం చెందారు.

X
దిశ, వెబ్డెస్క్: కారు అదుపుతప్పి 600 అడుగుల లోయలో పడటంతో.. ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాశిక్ లోని సప్తశృంగి గఢ్ ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి 600 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను నిఫాడ్ లోని పింపల్ గావ్ బస్వంత్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Next Story






