కారు, బైకు ఢీ.. ఒకరు మృతి..

by Disha Web Desk 11 |
కారు, బైకు ఢీ.. ఒకరు మృతి..
X

దిశ, వంగూరు: కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వంగూరు మండల పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండల పరిధిలోని ఉమ్మాపూర్ గ్రామానికి చెందిన కొత్తూరి బాల్ లింగయ్య తన ద్విచక్ర వాహనంపై డిండి నుంచి తన గ్రామానికి వెళుతున్నాడు.

ఈ క్రమంలో తన వెనక నుంచి వేగంగా వస్తున్న కారు బాల్ లింగయ్యను ఢీకొట్టడంతో మతిస్థిమితం కోల్పోయాడు. దీంతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ వాహనంలో తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు.


Next Story

Most Viewed