తాళం వేసున్న ఇంట్లో చోరి..

by Disha Web Desk 20 |
తాళం వేసున్న ఇంట్లో చోరి..
X

దిశ, ఖైరతాబాద్ : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కిమ్టికాలనీ, గోకుల్ రెసిడెన్సిలో మహమ్మద్ అహ్మద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నివసిస్థున్నారు. ఈయన ఇంటికి తాళం వేసి ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటి వెనకాల నుండి ప్రవేశించి కిటికీ అద్దం పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు.

అహ్మద్ తిరిగి ఇంటికి వెళ్లి తాళం తీసి చూడగా ఇంటి వెనకాల కిటికీ అద్దం ధ్వంసం అయ్యుండడం గమనించారు. అనుమానం వచ్చి అల్మార తెరిచి చూడగా 2.5లక్షల నగదు, 4 తులాల బంగారం కనిపించకపోవడంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed