- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విద్యుత్ షాక్ తో కాడెద్దు మృతి..
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఓ కాడెద్దు మృతి చెందింది. పశుగ్రాసం కోసం అడవికి వెళ్లి మేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ తీగ తెగి పడి కాడెద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాలలోకి వెళ్లితే మహబూబాబాద్ జిల్లా కేసుముద్రం మండలం బొడ మంచ్య తండా గ్రామ పంచాయితీ పరిధిలోని గుడి తండాకు చెందిన బోడకుమార్ కు రెండు కాడెడ్లు ఉన్నాయి.
శనివారం పక్కనే ఉన్న మహబూబాబాద్ మండలం ఇంద్రనగరం గ్రామ పంచాయితీ పరిధిలోని సింగిలాల్ తండాలో గల అడవి ప్రాంతానికి మేత మేసుకుంటూ వెళ్ళింది. ఆ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ లైన్ తెగి పడడంతో కాడెద్దు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ అడవి ప్రాంతంలో నిత్యం ప్రజలు, రైతులు సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో అటుగా ఎవ్వరు వెల్లకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. కాగా నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.