- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి..
by Taduka Kalyani |
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధి మున్ననూర్ గ్రామంలో జరిగింది.

X
దిశ, మిడ్జిల్: విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధి మున్ననూర్ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని మున్ననూర్ గ్రామానికి చెందిన దేవతల పెద్ద ఆంజనేయులు అనే రైతుకు చెందిన ఎద్దు వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద అర్థింగ్ వైరుకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.
ఎద్దు విలువ సుమారు రూ. 80 వేల వరకు ఉంటుందని రైతు ఆంజనేయులు తెలిపాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని రైతు వాపోయాడు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు మరమ్మత్తులు చేయించి అర్థింగ్ వైర్ కు విద్యుత్ సరఫరా కాకుండా చూడాలని కోరాడు. నష్టపోయిన బాధిత రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Next Story






