Hyd: మెట్రో స్టేషన్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

by velandi.Saikiran |   (  Updated:2026-03-13 20:46:00  IST  )

మెట్రో స్టేషన్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది.

Hyd: మెట్రో స్టేషన్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్ లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న శుక్ర‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ రెండవ అంతస్తు నుంచి నిత్యతేజ్ అనే బీటెక్ విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రెండవ అంతస్తు నుంచి దూకడంతో నిత్యతేజ్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ త‌రుణంలోనే 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు ప్రత్యక్ష సాక్షులు. కానీ ఆసుపత్రికి చేరుకునే లోపే నిత్యతేజ్ మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. దీంతో ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. ఈ సంఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిత్యతేజ్ సూసైడ్ వెనుక కార‌ణాల‌ను అన్వేషిస్తున్నారు. క్లిక్

Next Story