భార్యా, భర్తల హత్యకు కారణం అదేనా..

by Disha Web Desk 20 |
భార్యా, భర్తల హత్యకు కారణం అదేనా..
X

దిశ, జన్నారం : పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తి రెండు నిండు ప్రాణాలను తీశాడు. ఈ విషాదకర సంఘటన జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో జినుక లచ్చన్న(55), జినుక రాజేశ్వరి (53) దంపతుల దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వారిపై దాడి చేసి హత్య చేసినట్టు సమాచారం. జినుక లచ్చన్నకు అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ హత్యకు పాత కక్షలు కారణమని చెబుతున్నారు. కాగా, హత్య అనంతరం నిందితుడు జన్నారం పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ డబుల్ మర్డర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed