వివాహేతర సంబంధం.. ప్రశ్నించినందుకు భర్తకు గుండు కొట్టించిన ప్రియుడు

by Disha Web Desk 4 |
వివాహేతర సంబంధం.. ప్రశ్నించినందుకు భర్తకు గుండు కొట్టించిన ప్రియుడు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో దారుణం చోటు చేసుకుంది. వంశీ అనే యువకుడిపై ఇద్దరు యువకులు దాడికి పాల్పడ్డారు. భార్యతో వివాహేతర సంబంధంపై ప్రశ్నించాడని దాడికి పాల్పడినట్లు తెలిసింది. తన భార్యతో హర్షవర్ధన్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

రిప్ అంటూ సోషల్ మీడియలో కామెంట్ చేశాడు. అది చూసిన ప్రియుడు హర్షవర్ధన్ బాధిత భర్తను పట్టుకుని గుండు కొట్టించాడు. ఆపై అతనిపై మూత్రం పోశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ బెదిరించాడు. అడ్డుకోవాల్సిన కొంత మంది వ్యక్తులు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హర్షవర్ధన్ తో పాటు అతని అనుచరుడు అన్వర్‌ను, వీళ్లకు సహకరించిన మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story