- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. హుటాహుటిన ముంబైకి దారి మళ్లింపు
by Kema Shiva Kumar |
ఇటీవల స్కూళ్లు, కాలేజీలు, ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల స్కూళ్లు, కాలేజీలు, ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పరిధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జెడ్డా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకులు ఎయిర్పోర్టు అధికారులకు మెయిల్ పంపారు. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాన్ని హుటాహుటిన ముంబై ఎయిర్పోర్ట్కు దారి మళ్లించారు. ఎయిర్పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.
Next Story






