శ్రీకాకుళం జిల్లాలో భారీ పేలుడు..ముగ్గురు మృతి!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-16 21:25:02  IST  )

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని దుబ్బ‌గూడ గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఘ‌ట‌న‌లో ముగ్గురు కార్మికులు చ‌నిపోయారు.

శ్రీకాకుళం జిల్లాలో భారీ పేలుడు..ముగ్గురు మృతి!
X

దిశ‌,వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని దుబ్బ‌గూడ గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఘ‌ట‌న‌లో ముగ్గురు కార్మికులు చ‌నిపోయారు. చ‌నిపోయిన వారిని టెక్క‌లికి చెందిన అప్ప‌న్న‌, రామారావు, త‌మిళ‌నాడుకు చెందిన మురుగ‌న్ లుగా గుర్తించారు. ఈ ఘటనలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రానైట్ యాజమాన్యం క్వారీలో పిడుగు ప‌డ‌టంతో ముగ్గురు చ‌నిపోయార‌ని ఎలాంట బ్లాస్ట్ జ‌ర‌గ‌లేద‌ని చెబుతోంది.

కానీ మృత‌దేహాలు చెల్లా చెదురుగా ప‌డి ఉండ‌టం అనుమానాల‌కు దారి తీస్తోంది. ఈ నేప‌థ్యంలో మృతుల కుటుంబ స‌భ్యులు క్వారీ వ‌ద్ద‌కు వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టారు. బ్లాస్ట్ వ‌ల్ల‌నే చ‌నిపోయార‌ని కానీ యాజ‌మాన్యం బుకాయిస్తోంద‌ని మండిప‌డ్డారు. కొండ‌పై నుండి మృత‌దేహాల‌ను ఎందుకు కింద‌కు తీసుకువ‌చ్చార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన‌గా పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని బాధితుల‌ను శాంతిప‌జేశారు. పోస్ట్ మార్టంలో అస‌లు నిజాలు తెలుస్తాయ‌ని అక్క‌డ నుండి పంపించారు.

Next Story