వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

by Disha Web Desk 1 |
వ్యక్తిపై ఎలుగుబంటి దాడి
X

తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామ శివారులో ఘటన

దిశ, తాడ్వాయి : ఓ వ్యక్తిపై ఏలుగుబంటి దాడి చేసి గాయపరచిన ఘటన తాడ్వాయి మండల పరిధిలోని సంగోజీవాడి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో కొంత మంది రైతులు పంట చేనులో ట్రాక్టర్ తో దున్నుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఎలుగుబంటి అక్కడ ప్రత్యక్షమైంది. అనంతరం రైతుల మీద ఎలుగుబంటి దాడికి ప్రయత్నించడంతో వారందరు కలిసి ముకుమ్మడిగా అక్కడి నుంచి తరిమేశారు. అక్కడి నుంచి సంగోజీవాడి గ్రామంలోని వంద మంది ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న వారిపై దాడికి దిగడంతో అక్కడ వారు గడ్డపారలతో అక్కడి నుంచి తరిమేశారు. దీంతో ఎలుగు బంటి గ్రామ శివారులోని ఊర బావిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో బావి పక్కనే పొదలు ప్రక్కన నిలిచి ఉన్న గైని రైతు బాలసాయిపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ప్రమాదంలో బాలసాయి వెనుక భాగంలో, చేతులకు, మోచేతికి గాయలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story