బడా పహాడ్ దర్గాకు వెళ్తుండగా ఆటో బోల్తా.. ఇద్దరి మృతి

by Disha Web Desk 12 |
బడా పహాడ్ దర్గాకు వెళ్తుండగా ఆటో బోల్తా.. ఇద్దరి మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడా పహాడ్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ దర్గాలో ఒకటైన బడాపహాడ్‌ను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఉన్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. 5 గురికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో హైమది(50) మోయిన్ (42 ) లను కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కొరకు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నిద్ర మత్తు ప్రమాదానికి కారణమని తెలిసింది.


Next Story

Most Viewed