- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు, సిబ్బందిపై దాడి
by Ajay Maddhiboyina |
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్, సిబ్బందిపై కొంతమంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్, సిబ్బందిపై కొంతమంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటు చేసుకుంది. కుటాగుళ్ల బెల్టు షాపు వద్ద గొడవ జరగ్గా గాయపడిన వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వ్యక్తిని కొట్టేందుకు మరోసారి దాడి చేసిన వ్యక్తులు ఆస్పత్రి వద్దకు వచ్చారు.
ఈ క్రమంలో డాక్టర్లు, సిబ్బందితో వాగ్వాదికి దిగి వారిపైనా దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. కాగా ఓ వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టి కిందపడేసిన భయంకర దృష్యాలు కనిపిస్తున్నాయి. తమపై దాడి చేయడంతో కదిరిలో డాక్టర్లు విధులు బహిష్కరించారు. దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. video
Next Story






