నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

by Disha Web Desk 11 |
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత.. వ్యక్తి అరెస్ట్
X

దిశ, ఊట్కూర్ : ఊట్కూర్ మండల పరిధి తిప్రాస్ పల్లి గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం తిప్రాస్ పల్లి గ్రామానికి చెందిన కావలి చిన్న నరసింహులు అక్రమంగా పల్లవి కంపెనీకి చెందిన నకిలీ పత్తి విత్తనాలను నిలువ ఉంచి రైతులకు అమ్ముతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 71 ప్యాకెట్లు నకిలీ పత్తి విత్తనాలు, వాటి విలువ 66,030/- ఉంటుందని వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.



Next Story

Most Viewed