అనంతపురం బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసులు కాల్పులు

by Kema Shiva Kumar |

ఐదేళ్ల బాలుడి హత్య కేసుకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై దాడికి యత్నించిన నిందితుడు సర్వేశ్‌కుమార్‌పై పోలీసులు కాల్పులు జరిపారు

అనంతపురం బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసులు కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా యాడికిలో బావమరిది అయిన ఐదేళ్ల బాలుడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు సర్వేశ్‌కుమార్‌పై పోలీసులు తాజాగా కాల్పులు జరిపారు. సీన్ రీకన్‌‌స్ట్రక్షన్ చేసేందుకు ఘటనాస్థలికి తీసుకెళ్తుండగా నిందితుడు పోలీసులపై తిరగబడ్డాడు. ఖాళీ బీరు బాటిల్‌తో విచక్షణారహితంగా దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో నిందితుడి మోకాళ్లపై సీఐ కాల్పులు జరిపారు. ఈ దాడిలో సీఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్‌, నిందితుడికిగ గాయాలయ్యాయి.

Next Story