చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, ఝరాసంగం: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఝరాసంగం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజేందర్ రెడ్డి కథనం ప్రకారం.. బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమానికి సాధువులు వస్తూ.. వెళుతూ ఉంటారు. అదే క్రమంలో మే 5న ఓ గుర్తు తెలియని సాధువు వయస్సు (75) ఆశ్రమానికి వచ్చారు. మే 7న స్పృహ కోల్పోవడంతో ఆశ్రమ నిర్వహణ ఇన్ చార్జి వెంకటేశం 108 అంబులెన్స్ లో జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మే14న అర్ధరాత్రి మృతి చెందినట్లు ఎస్సై రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆశ్రమ ఇన్ చార్జి కోట వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.



Next Story

Most Viewed