బైక్ ఢీకొని వృద్ధుడి మృతి

by Disha Web Desk 1 |
బైక్ ఢీకొని వృద్ధుడి మృతి
X

దిశ, కొహెడ : బైక్ ఢీకొని వృద్ధుడి ఓ మృతి చెందిన ఘటన కోహెడ మండలం సముద్రాల గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొహెడ మండలం సముద్రాలకు చెందిన మౌటం వీరయ్య (65) సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలోనే హుస్నాబాద్ నుంచి ద్విచక్ర వాహనంపై సిద్దిపేట వైపు వెళ్తున్న బోదాసు రవి అనే వ్యక్తి అజాగ్రత్తగా వాహనం నడుపుతూ వీరయ్యను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రయాదంలో తీవ్రంగా గాయపడిన వీరయ్యను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Next Story

Most Viewed