మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

by Disha Web Desk 1 |
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, జగిత్యాల రూరల్ : ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని మనస్తపానికి గురైన విద్యార్థి ఆత్యహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి అభిషేక్ (17) జగిత్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed