- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామినేని ఆస్పత్రిలో సర్జరీ చేస్తుండగా.. ‘నారాయణ’ ఉద్యోగి మృతి
ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో కాంప్లెక్స్ కార్డియాక్ సర్జరీ (క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స) చేస్తుండగా.. ఓ వ్యక్తి మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

దిశ, వనస్థలిపురం : ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో కాంప్లెక్స్ కార్డియాక్ సర్జరీ (క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స) చేస్తుండగా.. ఓ వ్యక్తి మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కు చెందిన నరేష్ (38) నారాయణ విద్యా సంస్థలో అకౌంట్స్ విభాగంలో డివిజనల్ అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. ఇటీవల తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడుతూ గుండెలో నొప్పిగా ఉందంటూ.. కామినేని ఆస్పత్రికి వచ్చారు. నరేష్ను పరిశీలించిన డాక్టర్లు.. కాంప్లెక్స్ కార్డియాక్ సర్జరీ (క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స) చేయాలని నిర్ణయించారు. సర్జరీకి రూ. 8 లక్షలు ఖర్చు అవుతుందని ముందుగానే హాస్పిటల్ యజమాన్యం చెప్పారు. రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ ప్రాసెస్ అనంతరం బుధవారం ఆపరేషన్ షురూ చేశారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినప్పటికీ తీవ్రమైన రక్తస్రావం (హెమరాజిక్ షాక్) కారణంగా రోగి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి
కామినేని యాజమాన్యం జూనియర్ డాక్టర్లతో సర్జరీ చేయించి నరేశ్ను నిండుప్రాణం తీశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని.. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే నరేశ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు రోధించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వెంటనే ఎల్బీనగర్ పోలీసులు రంగప్రవేశం చేసి బాధితులకు సర్దిచెప్పారు. నారాయణ విద్యాసంస్థల పెద్దలు, పోలీసులు కామినేని యాజమాన్యంతో మాట్లాడుతున్నారు.





