కారును ఢీ కొట్టిన అమర్ రాజా కంపెనీ బస్సు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-08 05:09:25  IST  )

కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాదం మొదలు.. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.

కారును ఢీ కొట్టిన అమర్ రాజా కంపెనీ బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో బస్సు ప్రమాదం మొదలు.. వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తిరుపతి జిల్లా పాతరేణిగుంట సమీపంలో ఎంప్లాయిస్ ను తీసుకువెళ్తున్న అమరరాజా కంపెనీకి చెందిన బస్సు కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జనుజ్జవ్వగా.. ఈ రెండింటి పక్క నుంచి వెళ్తున్న టీవీఎస్ వాహనదారుడు గాయపడ్డాడు. అతని కాలు ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. నగరి నుంచి కరకంబాడి సమీపంలో ఉన్న అమరరాజా ఫ్యాక్టరీ ఉద్యోగులను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరగింది. ప్రమాదంలో ఎవరైనా మరణించారా? కారులో ఉన్నవారి పరిస్థితి ఏంటి ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Read More..

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ఇన్నోవా.. స్పాట్ లో 8మంది

Next Story